సల్మాన్ ఖాన్ హీరోగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలీవుడ్ అగ్రహీరో వెంకీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా నుండి ఏంటమ్మా అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈపాటలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్లతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించడంతో పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్యమాల్లో కలిపి 43 మిలియన్స్కు పైగా వ్యూస్ను సాధించి దూసుకెళ్తోంది. ఏంటమ్మా సాంగ్ ను విజయ్ డడ్లాని, పాయల్ దేవ్, రఫ్లార్ ఆలపించగా.. షబీర్ అహ్మద్ సాహిత్యాన్ని అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మేకర్స్ ఈ సాంగ్ మేకింగ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈనేపథ్యంలో పాట గురించి మాట్లాడుతూ.. ఏంటమ్మా సాంగ్ను చేసేటప్పుడు బాగాఎంజాయ్ చేశానని, అందరం కలిసి అదర గొట్టేశామని తెలిపాడు. ఇద్దరు పెద్ద స్టార్ హీరోలతో కలిసి తాను ఏంటమ్మా సాంగ్లో నటించటం కల నిజమైనట్లుగా ఉందని, మరచిపోలేని అనుభూతి అని చెబుతూ , ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్కి పండగలా ఉంటుందని అన్నారు రామ్ చరణ్. కాగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: