రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది నెలల పాటు సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న సాయి మొదట ఒప్పుకున్న సినిమా విరూపాక్ష. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ , సంయుక్త జంటగా తెరకెక్కుతున్న విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీ కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరూపాక్ష మూవీ లో ఒక రిస్కీ బైక్ సీన్ ఉంది. సాధారణంగా ఎవరికైనా బైక్ యాక్సిడెంట్ జరిగితే తర్వాత వేగంగా వెళ్లేందుకు జంకుతారు. అయితే విరూపాక్ష చిత్రం కోసం తేజ్ ఏ మాత్రం భయపడకుండా కాలువ గట్టు పై 100 కిలోమీటర్ల స్పీడ్తో బైక్ నడిపారు. మేకర్స్ డూప్ పెడతానన్నా పట్టించుకోకుండా సాయి తేజ్ తనే రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ను సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారు. దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ .. యాక్సిడెంట్ నుంరచి కోలుకున్న తర్వాత సాయి తేజ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారనీ , అదే టైమ్లో బైక్ సీక్వెన్స్ చేయాల్సి ఉండగా.. ఏ మాత్రం భయం లేకుండా తానే కంప్లీట్ చేస్తానని చెప్పి ఆ సీన్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేశారనీ చెప్పారు. తాజాగా సాయి తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి వినోదయ సిత్తం తమిళ మూవీ తెలుగు రీమేక్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: