హీరోయిన్స్ కు ట్రోల్స్ అనేవి కామన్. సోషల్ మీడియా వేదికగా వారు ఏదో ఒక రకంగా ట్రోలింగ్స్ కు గురవుతూనే ఉంటారు. వారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా కొంతమంది అదే పనిగా ట్రోల్ చేయడానికి రెడీ గా ఉంటారు. ఇక హీరోయిన్స్ కు కూడా అది అలవాటయిపోతుంది. మొదట కాస్త వాటివల్ల ఇబ్బంది పడినా ఎక్స్ పీరియన్స్ తో ట్రోలింగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చేసుకుంటారు. ఇక రష్మిక మందన్న కూడా అదే అంటుంది. ఈమధ్య కాలంలో ఎక్కువగా ట్రోలింగ్ కు గురైన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక అని చెప్పొచ్చు. ఇక తాజాగా దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతుం రష్మిక హిందీలో రిలీజ్ కాబోతున్న మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది రష్మిక. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. విమర్శలను ఎదుర్కొనే పరిపక్వత తనకు వచ్చిందని తెలిపింది. ఇంకా నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదారేళ్లు అవుతుంది.. ఈ టైమ్ లో నేను తెలుసుకుంది.. అందరికీ మనం నచ్చమనీ.. మన సినిమాలు ఆస్వాదించరని గ్రహించా. ప్రేక్షకులు నా గురించి సానుకూలంగా మాత్రమే ఆలోచిస్తారని ఆశించకూడదు.. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ద్వేషం ప్రదర్శించినా పాజిటివ్గా ఉండాలని నిర్ణయించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది.
కాగా ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు తెలుగులో కంటే తను హిందీలోనే అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా కెరీర్ లో దూసుకుపోతుంది. మరోవైపు తెలుగులో పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: