రీసెంట్ గా ఒకే ఒక జీవితం మూవీ తో హీరో శర్వానంద్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈసినిమాకు సబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీలో హీరో శర్వానంద్ కు జోడీగా కృతి శెట్టి ని ఎంపిక చేయడానికి మేకర్స్ కృతిని సంప్రదించినట్టు.. ఆమె ఓకే చేసినట్టు సమాచారం. కృతి శెట్టి గ్లామర్ పార్ట్ కే పరిమితం కాకుండా.. ఈసినిమాలో మంచి పెర్ఫామెన్స్ రోల్ ను ఇస్తున్నట్టు, స్టోరీ హీరోయిన్ వల్లే టర్న్ తీసుకునే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. వచ్చే నెలలో హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభం కానుందనీ, సినిమాలో ఎక్కువ భాగం లండన్లో షూట్ చేయనుండగా, యూరప్లోని కొన్నిప్రాంతాల్లో కూడా షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న #NC 22 ఇంకా ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: