ఈమధ్య ఒక సినిమా హిట్ అయిన వెంటనే దానికి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా హిట్ అవుతుండటంతో మేకర్స్ కూడా సీక్వెల్స్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ బ్రదర్స్ ఎవరో కాదు సూర్య, కార్తి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెండు సీక్వెల్స్ ల దర్శకుడు కూడా ఒకరే అవ్వడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూర్య విక్రమ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఫస్టు పార్టు చివర్లో వచ్చిన రోలెక్స్ పాత్రలో సూర్య చేసింది కొన్ని నిమిషాలు మాత్రమే అయినా కూడా తన నటన హైలెట్ గా నిలిచింది సినిమాకు. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ లో సూర్య పాత్ర ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కడానికి కూడా ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది. దీంతో అటు సూర్యతో పాటు సూర్య అభిమానులంతా ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుందని ఇప్పటికే లోకేష్ తెలిపాడు.
అయితే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్ ఇక రీసెంట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
మరోవైపు సూర్య, కార్తి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. మరి లోకేష్ ఎవరి సినిమా సీక్వెల్ ను మొదట స్టార్ట్ చేస్తాడో అన్నది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: