ఢిల్లీ లోని రామ్లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగలేదు. ఈ సంవత్సరం రామ్ లీలా మైదానం లో రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. దసరా పర్వదినం సందర్భంగా రామ్ లీలా మైదానం లో రావణ దహనం చేశారు. విల్లు ఎక్కిపెట్టి రావణాసురుడి బొమ్మను ప్రభాస్ భస్మం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ నుచూసేందుకు వేలాది మందిగా అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ అక్టోబర్ 2 వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 101 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీమ్ సందడి చేసింది. ప్రభాస్తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ప్రభాస్ ఫొటోలు దిగారు. రావణ దహనం కార్యక్రమం తర్వాత ఆదిపురుష్ టీజర్ను కూడా ప్రదర్శించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: