ఇప్పుడు మల్టీస్టారర్లు తీయడానికి కూడా హీరోలు ఏమాత్రం వెనుకాడట్లేదు అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సాయి తేజ్ ఇంకా వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ తీస్తా అంటున్నాడు మరో మెగా హీరో. ఆ మెగా హీరో ఎవరో కాదు మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. గిరీశయ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ ఈ కామెంట్స్ చేశాడు. తనకు డైరెక్షన్ అంటే ఇష్టం అని దర్శకత్వం మీద దృష్టిసారిస్తానని హీరో తెలిపాడు. అంతేకాదు భవిష్యత్లో ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తాను.. ఇప్పటికే నేను ఒక కథ కూడా రాసుకున్నాను.. అన్నయ్య సాయి ధరమ్ తేజ్, బావ వరుణ్ తేజ్ లతో ఓ మల్టీస్టారర్ తీయాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ సినిమా వస్తుంది’ అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు. మరి మెగా అభిమానులు వైష్ణవ్ చేసిన కామెంట్స్ కు ఖుషీ అవుతున్నారు. చూద్దాం మరి కాంబినేషన్ లో సినిమా వైష్ణవ్ ఎప్పుడు తీస్తాడో.
కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ఇప్పటి వరకూ చేసిన రెండు సినిమాలకు భిన్నంగా వైష్ణవ్ తేజ్ ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: