ప్రస్తుతం కరోనా ప్రభావం మరీ ఎక్కువగా లేకపోయినా కూడా కేసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ కూడా కరోనా బారినపడ్డారు. అమితాబ్ బచ్చాన్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈవిషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.. నాతోపాటు నా చుట్టూ ఉన్న వారందరూ దయచేసి కరోనా పరీక్షించుకోండి.అని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇక అమితాబ్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. గతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన కోరనా బారిన పడగా ఇప్పుడు మరోసారి కరోనా బారినపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
T 4388 – I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022
కాగా అమితాబ్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇంకా ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు అమితాబ్. ఇంకా రష్మిక మందన్నతో కలిసి ‘గుడ్ బై’ సినిమా చేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: