సౌత్ నుండి నార్త్ వరకూ.. నార్త్ నుండి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తమిళ్ స్టార్ నటుడు ధనుష్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తనకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు ధనుష్. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు ధనుష్. తెలుగులో కూడా స్రైయిట్ సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా తిరుచిత్రంబలం. తెలుగులో ఈసినిమాను తిరు పేరుతో రిలీజ్ చేయనున్నారు. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో వస్తున్నఈసినిమా ఆగష్ట్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే నేడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
కాగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాలో ధనుష్కు జోడీగా రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: