సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “వారసుడు “, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “, టైగర్ ష్రాఫ్ “స్క్రూ ఢీలా” బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వికాస్ బహల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ , రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ డ్రామా “గుడ్ బై ” హిందీ మూవీ అక్టోబర్ 7వ తేదీ రిలీజ్ కానుంది. “గుడ్బై”మూవీ కై రష్మిక కొత్త ఛాలెంజ్ను స్వీకరించారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం డబ్బింగ్ ను పూర్తిచేసే పనిలో బిజీగా ఉంది. తొలి బాలీవుడ్ సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెబుతూ రష్మిక సినిమాల పట్ల తనకున్న అంకితభావాన్ని, హార్డ్వర్క్ను మరోసారి చాటుకున్నారు. తన పాత్రకు సంబంధించిన డైలాగ్ పేపర్ ముందుపెట్టుకొని డబ్బింగ్ చెబుతున్న తన ఫొటోను రష్మిక ఏదీ తేలికగా రాదు అనే క్యాప్షన్ తో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: