గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులే వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో ఉండే చిన్న నటుల దగ్గర నుండి పెద్ద నటుల వరకూ.. అలానే చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకూ అందరికీ న్యాయం చేకూరేలా.. అలానే ఓటీటీ సమస్యలు ఇలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలు ప్రత్యేకంగా చర్చలు జరిపుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే ‘మా’ అసోసియేషన్ సభ్యులు కూడా సమావేశం అయి పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజును కలవడం జరిగింది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. మా తరుపున టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ను కలవడం జరిగింది.. ఈసందర్బంగా తమ సినిమాల్లో మా సభ్యులకు అవకాశం ఇవ్వాలని అలానే కొత్త వారిని కూడా ప్రోత్సహించాలని రిక్వెస్ట్ చేశామని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J
— Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022
కాగా మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి మంచు విష్ణు ఫస్ట్ లుక్ అలానే ఫ్రెండ్ షిప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: