క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. మరోవైపు సామ్ ఫ్యాన్స్ ఈసినిమా అప్ డేట్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ను అప్ డేట్ ఇవ్వమని కూడా కోరుతున్నారు. దీంతో మేకర్స్ తాజాగా ఈసినిమా అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ అప్ డేట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సీజీ వర్క్ తో ఎన్నో ఛాలెంజ్ లు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయినా కూడా మీకు మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నాం.. ఇలాంటి క్రూషియల్ టైమ్ లో టీమ్ కు మీ సపోర్ట్ అవసరం అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Shaakuntalam ✨🦢 pic.twitter.com/bJEPgDTdMd
— Neelima Guna (@neelima_guna) August 2, 2022
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: