పలువురు టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ మూవీస్ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “అర్జున్ రెడ్డి “మూవీ ని హిందీ లో “కబీర్ సింగ్ “గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగా విజయం సాధించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ సింగ్ , రష్మిక జంటగా”యానిమల్ ” హిందీ మూవీ తెరకెక్కుతుంది. గౌతమ్ తిన్ననూరి “జెర్సీ “మూవీ , శైలేష్ కొలను “HIT :ది ఫస్ట్ కేస్”మూవీస్ హిందీ రీమేక్స్ తోబాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ హీరోగా “ఛత్రపతి”మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి” తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. సెన్సేషనల్ హిట్ “RX100” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి ని ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “మహాసముద్రం ” మూవీ నిరాశపరిచింది.అజయ్ భూపతి ప్రీవియస్ వర్క్ కు ఇంప్రెస్ అయ్యి ప్రముఖ బాలీవుడ్ దర్శక , నిర్మాత రాజ్ కుమార్ హిరాణీ , అజయ్ కు బాలీవుడ్ ఛాన్స్ ఇచ్చారని సమాచారం. రాజ్ కుమార్ టీమ్ కథ గానీ , అజయ్ కథ తో గానీ అజయ్ దర్శకత్వం లో ఈ బాలీవుడ్ మూవీ తెరకెక్కనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: