హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. హను రాఘవపూడి మరోో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించునున్నారు. ఈనేపథ్యంలో దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ లేదా ప్రభాస్ కానీ అతిథులుగా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కుతుంది. ఈనేపథ్యంలో ప్రభాస్ ను తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు అశ్వినీదత్ ఫ్యామిలీ కి ఎన్టీఆర్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. గతంలో వారి చాలా సినిమాలకు ఎన్టీఆర్ వచ్చాడు. దీంతో సీతారామం సినిమాకు కూడా ఎన్టీఆర్ ను తీసుకొస్తున్నారని అంటున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు వస్తారు..? వీరు కాకుండ మరెవరైనా వస్తారా అన్న దానిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ కూడా నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: