అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019లో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే కదా. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించింది. ఇక ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 సీక్వెల్ ను తెరకెక్కించాడు అనిల్. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ సీక్వెల్ ఆ అంచనాలను నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెట్టింపు ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈసినిమా. వెంకీ, వరుణ్ల కామెడీ టైమింగ్ తో.. అనిల్ రావిపూడి మేకింగ్ తో ప్రేక్షకులు మరోసారి నవ్వుకునేలా చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా రిలీజ్ అయి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 సెంటర్లలో ఈసినిమా ఇంకా ఆడుతున్నట్టు తెలిపారు.
ఇక ఈసినిమా ఓటీటీలోకి రాబోతున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే దానికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ అయిన 8 వారాల తరువాతే ఓటీటీ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టే ఈసినిమాను దాదాపు 50 రోజుల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈసినిమాను నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: