పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో మొదటి సినిమా రిలీజ్ కాకపోయినా బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్ ” శ్రీవల్లి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన రష్మిక పలు బాలీవుడ్ అవకాశాలు అందుకుంటున్నారు. రష్మిక ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో మరో అఫర్ ను అందుకున్నారని సమాచారం. శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ఒక హిందీ మూవీ తెరకెక్కనుంది.ఈ మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: