మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవి తేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్ “, బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న “#NBK107 “, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న “#MEGA 154 ” మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. తాజాగా శృతి హాసన్ “#MEGA 154 ” మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ మూడు సినిమాలపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: