టాలీవుడ్ హీరోల్లో కొంతమందికి సినిమా అయిపోయిన తరువాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లే అలవాటు ఉంటుంది. అలాంటివారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ముందే ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలిసిందే. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. ఇక తన పిల్లలు స్వీట్ మూమెంట్స్ ను, అల్లరిని అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటాడు. ప్రస్తుతం అయితే బన్నీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆఫ్రికాకి వెకేషన్కు వెళ్లాడు. దీనిలో భాగంగానే తను ఫ్యామిలితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరలు అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. రా అండ్ రస్టిక్ పాత్రలో బన్నీ చేసిన నటనకు సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోయారు. బాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది ప్రముఖులు సైతం తమ సోషల్ మీడియా వేదికగా బన్నీ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా తనతో నటించాలని ఉందని చెప్పిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో లో వచ్చిన ఈసినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో కూలీగా మొదలుపెట్టిన పుష్పరాజ్ సిండికేడ్ ఓనర్ గా ఎలా మారాడు అన్నది చూపించారు.
ఈసినిమా సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది. ఇక ఈపార్ట్ లో పుష్ప రాజ్ కు అలానే భైరవసింగ్ షెకావత్ కు మధ్య వార్ చూపించేలా ఉన్నారు. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: