మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు భీమవరంలో జరగనున్న విషయం తెలిసిందే.భీమవరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకున్న చిరంజీవికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు.చిరంజీవి కి అభిమానులు భారీ గజ మాలతో వెల్కమ్ చెప్పారు. ఈ క్రమంలోనే చిరంజీవి వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. చిరంజీవి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి చిరంజీవి వేదిక పంచుకోనున్నారు. ఇక, అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఏపీలో పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: