20 ఏళ్ల ప్రభాస్ నట ప్రస్థానం..!

20 years for Prabhas In TFI,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Completes 20 Years in TFI,Prabhas Latest Updates,Prabhas latest News,Prabhas In TFI, Prabhas Completes 20 Years In Telugu Film Industry,Prabhas Movies,Prabhas LatesT Movies,Prabhas Upcoming Movies,Prabhas Blockbuster Movies,Prabhas pan Indian Movies, Prabhas Project K Movie Updates,Prabhas Salaar Movie Updates,Prabhas Upcoming Movie Releases,20 Years For Prabhas in Telugu Film Industry

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘వర్షం’ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన రెండు సినిమాలు బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్ కాగా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి. పాన్ ఇండియాగా వచ్చిన సాహో, రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలు కూడా మంచి విజయం దక్కించుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండియా మార్కెట్ ను ఏలుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేటితో ప్రభాస్ నటన ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ సినిమాను మొదలుపెట్టారు.ప్రభాస్‌ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో సెలెబ్రేషన్స్ జరిపారు. ఈ సెలబ్రేషన్స్ లో కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రభాస్‌ ఈశ్వర్‌ చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. పాన్‌ ఇండియా స్టార్‌ అవుతాడని ఊహించలేదు. అతని పట్టుదల, శ్రమతో పాటు అభిమానుల అండదండలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రభాస్‌ని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది’అని అన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =