సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “మేజర్ “మూవీని ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీం ఇండియా మాజీ ప్లేయర్ , జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ సోషల్ మీడియా ద్వారా “మేజర్ “మూవీ పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడే “మేజర్ ” చిత్రాన్ని చూశాననీ, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఒక భావోద్వేగమనీ , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ది నిజమైన స్ఫూర్తి దాయక కథ అనీ , మీకు బాగా నచ్చుతుందనీ , ఇది కచ్చితంగా చూడాల్సిన చిత్రమనీ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: