కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. సాయి తేజ్ పూర్తిగా కోలుకొని తిరిగి సెట్స్ పైకి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ సాయి తేజ్ కు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. ఆయనకు పూలాభిషేకంతో యూనిట్ సభ్యులు స్వాగతం కూడా పలికారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. షూటింగ్ టైమ్ లో తీసిన ఒక ఫొటోను పోస్ట్ చేశారు. నైట్ టైమ్ తీసిన ఈఫొటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెట్ల మధ్యలో నుంచి వస్తున్న లైట్స్ వెలుతురులో సాయిధరమ్ అండ్ టీం షాడోస్ కనిపిస్తున్నాయి. ఈ స్టిల్తోనే సినిమా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అర్థమవుతుంది.
Team #SDT15 gives a peak into their Mystical world with this intriguing capture 💥📸
From the lens of @shamdatdop 🎥@IamSaiDharamTej @karthikdandu86 @aryasukku @iamsamyuktha_ @BvsnP @bkrsatish @SukumarWritings @SVCCofficial pic.twitter.com/GKm9MbKuc0— SVCC (@SVCCofficial) June 13, 2022
కాగా సాయిధరమ్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తుండటం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: