మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“వాల్తేరు వీరయ్య ” మూవీ లో తమ జీవితాలపై పెత్తనం .. తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి పోరాటం సాగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మలేషియా లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. చాల రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ లుక్లో నటిస్తున్న సినిమా ఇది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “#చిరంజీవి 154” మూవీ కై చెన్నైలో భారీ పడవ సెట్ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారనీ , ఈ సెట్ వేయడానికి కూడా మేజర్ టెక్నీషియన్స్ను కూడా మన టాలీవుడ్ నుంచే తీసుకెళ్ళారనీ సమాచారం. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: