కియారా అద్వానీ కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా కథానాయికగా నటించిన సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా తెరకెక్కిన “భూల్ భులయ్యా 2 “, “గోవిందా నామ్ మేరా” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కియారా ప్రస్తుతం “#RC15 “(తెలుగు ), “జుగ్ జుగ్ జియో ”(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ధర్మశాల టూర్ గురించి కియారా మాట్లాడుతూ .. కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాననీ, మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చిందనీ, .అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదనీ , వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నామనీ , .నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయనీ , మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారనీ , ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించిందనీ , .అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డామనీ , అదొక భయంకరమైన అనుభవం అనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: