‘విరాట పర్వం’.. ఒక సీన్ కోసం సాయిపల్లవి రోజంతా తినలేదు..!

Interesting Fact about Sai Pallavi during Virata Parvam Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Updates,Virata Parvam Latest Movie Updates,Virata Parvam Upcoming Movie Of Sai Pallavi, Sai Pallavi in Virata Parvam Movie,Interesting Facts about Sai pallavi During Virata Parvam Movie,Interesting Facts About Sai Pallavi,Virata Parvam Movie Shoot Updates,Virata Parvam Movie Shooting Latest Updates, Sai Pallavi Latest Intersting Updates From Sai Pallavi Shooting

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో సాయి పల్లవి మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎలాంటి పాత్రలు చేశాము.. ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు ఎన్ని చేశాము అన్నది మాత్రమే చూస్తుంది. అందుకే ఇండస్ట్రీలో సాయి పల్లవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. సాయి పల్లవి నటన ఒక ఎత్తైతే.. తన డ్యాన్స్ మరో ఎత్తని చెప్పొచ్చు. తన డ్యాన్స్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా తెలిసిందే. ప్రస్తుతం అయితే పలు సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాయిపల్లవి విరాటపర్వం సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. విరాటపర్వంలో వెన్నెల పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈసినిమా గురించి డైరెక్టర్ వేణు ఉడుగుల మాట్లాడుతూ సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయం తెలియచేశారు. ఈసినిమాలో ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది.. ఆ సీన్ కూడా చాలా ఇంటెన్స్ తో చేయాల్సి ఉంది. ఇక సాయిపల్లవి కూడా ఆ సీన్ కు ఉన్న ఇంటెన్సిటీ అలానే తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంది. దీంతో ఆ సీన్ న్యాచురల్ గా రావడానికి తను ఒక రోజంగా ఆహారం కూడా తీసుకోలేదని.. తన డెడికేషన్ అలా ఉంటుందని తెలిపాడు. అంతేకాదు వెన్నెల పాత్రకు సాయి పల్లవి ఆహార్యం, నటన బాగా కుదిరిందని కూడా తెలిపారు.

కాగా ఈసినిమా రిలీజ్ చాలా లేట్ అయింది. కరోనా వల్ల ఈసినిమాకు చాలా అడ్డంకులు ఏర్పడగా.. ఆ తర్వాత రిలీజ్ విషయంలో కూడా చాలా అంతరాయాలు వచ్చాయి. ఆ మధ్య అసలు ఈసినిమా గురించే అందరూ మరిచిపోయారు. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 1వ తేదీన ఈసినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.

కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 18 =