సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“మేజర్ “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు , అడివి శేష్ లతో డిజిటల్ క్రియేటర్, యూ ట్యూబర్ నిహారిక చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియో లో నిహారిక టికెట్స్ కోసం లైన్లో నిలుచుంటే ఆమె కంటే ముందు వచ్చి అడివి శేష్ నిలబడతారు . దాంతో ఆమె అతనితో గొడవపడుతుంటే.. వారి కంటే ముందు మహేష్ బాబు వచ్చి నిలబడతారు. మహేష్ను చూడగానే ఆశ్చరపోయిన నిహారికను మా స్నేహితులను కూడా పిలవొచ్చా అని అడిగితే , నిహారిక ష్యూర్ అంటారు. దాంతో మరి కొంత మంది ఆ లైన్లో వచ్చి చేరుతారు. మహేష్ బాబు ను నిహారిక ఫోన్ నెంబర్ అడిగే లోపు ఆయన వెళ్ళిపోతారు. ఈ క్రియేటివ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: