పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “సర్కారు వారి పాట” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తన ఫ్యామిలీ తో సమ్మర్ వెకేషన్ కు యూరోప్ వెళ్లిన విషయం తెలిసిందే. మహేష్ బాబు , ఆయన భార్య నమ్రత శిరోద్కర్ , తనయుడు గౌతమ్ కృష్ణ , తనయ సితార సమ్మర్ వెకేషన్ ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్ పూర్తి అయిన తరువాత మహేష్ బాబు “#SSMB 28” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మహేష్ బాబు తనయుడు గౌతమ్ పదో తరగతి పూర్తి చేశారు. జర్మనీలో గౌతమ్ ఘట్టమనేని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నామనీ , గౌతమ్ ను చూస్తే గర్వంగా ఉందనీ అంటు మహేష్ బాబు తన ఫ్యామిలీ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: