మత్తు వదలరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా. మొదటి సినిమాతోనే మంచి హిట్ తోపాటు మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీసింహా. ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు చేస్తున్నాడు. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా భాగ్ సాలే అనే సినిమా చేస్తుండగా.. సతీష్ త్రిపుర దర్శకత్వంలో దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు సతీష్ త్రిపుర. రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాను ప్రకటించారు. ఫణిదీప్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. తాజాగా ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక టైటిలే మాసీగా ఉంది.. దీన్ని బట్టి ఈసినిమాలో శ్రీసింహా మాస్ అవతారంలో కనిపిస్తాడేమో చూడాలి. కాగా వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.
Here’s unveiling our title ‘USTAAD’ with immense pride and promise to tug your heart..
It is going to be beyond what you expect..
USTAADing ur timelines now…
Let us know how do u like the title👇🏽@Simhakoduri23 @VaaraahiCC @SaiKorrapati_ @krishient#USTAAD pic.twitter.com/gUHZ0ILeD8
— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) May 26, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: