పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఇప్పుడు ఒక కొత్త సినిమాను అనౌన్స్ చేసింది.సురేష్ ప్రొడక్షన్స్ , ఇంట్రోయూప్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై నాని బండ్రెడ్డి దర్శకత్వంలో జై , అనంతిక జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్”రాజమండ్రి రోజ్ మిల్క్”మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో వెన్నెల కిషోర్ , ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గోవింద్ వసంత , యశ్వంత్ నాగ్ , భరత్ శౌరభ్ , అజయ్ అరసదా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాజమండ్రి రోజ్ మిల్క్”మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ కానుందని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఆ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని , “రాజమండ్రి రోజ్ మిల్క్”మూవీ పై ఆసక్తిని కలిగించింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: