సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.అనసూయ ఇప్పుడు మరో మూవీ లో కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వ సినిమాస్ ఎల్ ఎల్ పై బ్యానర్ పై రంజిత్ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో యాక్షన్ థ్రిల్లర్ “మైఖేల్ “మూవీ తెరకెక్కుతుంది. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , గౌతమ్ వాసుదేవ మీనన్ , వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనసూయ బర్త్ డే సందర్భంగా “మైఖేల్”మూవీ యూనిట్ ఈ మూవీ లో అనసూయ ఒక కీలక పాత్ర కై ఎంపిక అయినట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: