గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం గోపీచంద్ పలు రీసెర్చ్ లు కూడా చేశాడు. ఇక ఈసినిమాలో కూడా బాలకృష్ణను రెండు పాత్రల్లో గోపీచంద్ చూపించనున్నట్టు ఇప్పటికే తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లోనే శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ షెడ్యూల్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య కు అలానే విలన్ పాత్రలో నటిస్తున్న దునియా విజయ్ మధ్య యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలబడనుందని అంటున్నారు. ఇప్పటికే రెండు యాక్షన్స్ ను తెరకెక్కించిన గోపీచంద్ ఇప్పుడు మూడో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడు. మరి చూద్దాం బాలయ్య విశ్వరూపం తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: