యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తను కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీ తరువాత చాలా సినిమాలను లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇక రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఇక ఈఏడాదే మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈసినిమాను కూడా వీలైనంత తొందరలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా ఈసినిమాను రిలీజ్ చేయలని అనుకుంటున్నారట. ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు రోజులు ముందు ఆగష్ట్ 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే.
కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: