బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2 “, “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీస్ తో బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా ప్రారంభం అయ్యింది. పలు సూపర్ హిట్ సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కానున్నాయి. “పుష్ప :ది రైజ్”బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. “ఆర్ ఆర్ ఆర్ “, “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీస్ భారీ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో ప్రదర్శించబడుతున్నాయి. బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ను సౌత్ మూవీస్ డామినేట్ చేస్తుండటం తో హిందీ ఫిలిం మేకర్స్ భయపడిపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు.సౌత్ వాళ్లు సినిమా పట్ల ఎంతో ప్యాషన్తో పని చేస్తారనీ , తీసే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచంలోనే బెస్ట్ సీన్గా ఉండాలన్న తపనతో తీస్తారనీ , అంకిత భావం తో ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో నిబద్ధతతో తీస్తారనీ , ఈ మధ్య కాలం లో సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు గుణపాఠం నేర్పాయనీ , దీన్నుంచి బాలీవుడ్ మేకర్స్ తప్పకుండా ఎంతో కొంత నేర్చుకోవాలనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: