బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు కృతి శెట్టి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం అభినయం తో కృతి శెట్టి ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ లో కృతిశెట్టి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.కృతి శెట్టి రీసెంట్ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ రోల్ గురించి మాట్లాడుతూ .. తనకు రొటీన్ గా అనిపించే పాత్రలు చేయాలని లేదనీ , తన పాత్ర నచ్చితేనే సినిమా చేస్తాననీ , తనకు రాకుమారిగా నటించాలని ఉందనీ , అదే తన డ్రీమ్ రోల్ అనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: