కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “ఆచార్య “మూవీలో నక్సలైట్గా ఉన్నప్పుడు అడవిలో చిరుతపులి కనిపించే సీన్ తన ఫేవరేట్ సీన్ అనీ , ఈ సీన్ గురించి తనకు పూర్తిగా తెలియకుండానే దర్శకుడు కొరటాల చిత్రీకరించారనీ , తాను ఇదొక మాంటేజ్ షాట్ అయ్యి ఉంటుందని భావించాననీ , కానీ కొరటాల శివ అసలు సీన్ను తనకు చూపించి సర్ప్రైజ్ చేశారనీ ,అందుకే ఈ సీన్ అంటే తనకు చాలా ఇష్టమనీ , చిరుత పులులు తమను దగ్గర్నుండి చూస్తున్న సీన్ చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్బంప్స్ వస్తాయనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: