శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు చూపించి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న సంగతి తెలిసిందే. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా అవ్వడం దానికితోడు అడివి శేష్ ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలతో వస్తాడు కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇంకా మొదలుపెట్టలేదు మేజర్ టీమ్. అయితే అప్పుడప్పుడు అడివి శేష్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ దానికి ఎపిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రో-రేటెడ్ డాల్బీ అట్మాస్ థియేటర్ లో సౌండ్ మిక్సింగ్ కు చేస్తుండగా ఈపిక్ ను పోస్ట్ చేశాడు. ఇక ఫొటోలో ఒకవైపు తాజ్ హోటల్ మంటల్లో కాలిపోతుండగా.. మరోవైపు కమాండో తన లక్ష్యాన్ని గురిపెట్టడాన్ని చూడవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Epic
X#MajorTheFilm pic.twitter.com/l5tbbXCZsS— Adivi Sesh (@AdiviSesh) April 23, 2022
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. మే 27న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: