పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని ఇటీవలే తెలిపింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఆపాటను కూడా పూర్తిచేసే పనిలో పడింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో మాస్ సాంగ్ కు హీరో హీరోయిన్లు మహేష్ బాబు, కీర్తీ సురేష్ స్టెప్పులేస్తున్నారు. ఇక ఈపాటతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ కూాడా చిన్నగా స్టార్ట్ చేసిస సంగతి విదితమే. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అందరూ మూడవ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మూడో పాట మంచి మాస్ సాంగ్ రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా థమన్ కూడా దీనిపై అప్ డేట్ ఇచ్చాడు. మరి ఎప్పుడో రిలీజ్ చేస్తారో చూడాలి.
కాగా పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: