పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే పూర్తిచేసుకుంది. ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. త్వరలో అది కూడా పూర్తిచేయనున్నారు. ఇక ఈసినిమా మే 12న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విడుదలకు ఇంకో నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతంచేసుకున్నాయి. త్వరలో మూడో పాటను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు అంబేద్కర్ జయంతి. ఈసందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నివాళులు అర్పించారు. రాజ్యాంగ రూపకర్త అయిన బీఆర్ అంబేద్కర్ జయంతి నేడు. ఆయన మన దేశానికి చేసిన సహకారం ఎప్పుడూ మరిచిపోలేనిది. ఆయన పట్ల గౌరవం, వినయం ఎప్పుడూ ఉంటాయి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Remembering the architect of our constitution Shri #BRAmbedkar ji on his birth anniversary today. His contribution to our nation will always be unparalleled. I stand in respect, awe and honour always! pic.twitter.com/drJAKLeq1G
— Mahesh Babu (@urstrulyMahesh) April 14, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: