టాలీవుడ్ లో నేడు మరో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు హైద్రాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలయ్య మరణంపై నందమూరి బాలకృష్ణ కూడా స్పందించి విచారం వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ద్వారా బాలయ్య మరణంపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండ నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య గారు తన ప్రతిభ చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురద్రుష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా ఎత్తుకు పై ఎత్తు అనే సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసినా కూడా ఆయన ఎన్నో సినిమాల్లో ఆయన క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తన సినీ ప్రయాణంలో దాదాపు 300కు పైగా చిత్రాల్లో బాలయ్య నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు బాలయ్య. అమృత ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా పలు సినిమాలను కూడా నిర్మించారు. శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం సినిమాను ఆయనే నిర్మించగా..ఆ సినిమాకు ఉత్తమ నిర్మాతగా ఆయన నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా ఊరికిచ్చిన మాట సినిమా తీయగా దానికి కూడా ఉత్తమ కథా రచయితగా బాలయ్య నంది అవార్డు అందుకున్నారు. ఇంకా ఇక దర్శకుడిగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు వంటి సినిమాలను బాలయ్య డైరెక్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: