కరోనా టైమ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న ఆది పినిశెట్టి. గత కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘యాగవరాయినుం నా కాక్క’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుండి వార్తలు వస్తున్నాయి.. అయితే ఆ వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. నేడు వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The best thing to hold onto in life is each other.We found each other a couple of years ago & it’s official now!
24.3.2022 was special for us. We got engaged in the presence of both our families.
Seeking all ur love & blessings as we take on ths new journey together🙏 pic.twitter.com/zRmf9VfXwh— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2022
కాగా సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి కూడా తన వైవిద్యమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తమిళ్ లో హీరోగా పలు సినిమాలో చేస్తూనే మరోవైపు తెలుగులో కూడా పలు వైవిధ్యమైన పాత్రలను దక్కించుకుంటున్నారు. విలన్ రోల్స్ తో పాటు రంగస్థలంలో చేసిన కుమార్ బాబు లాంటి పాత్రలు కూడా దక్కించుకుంటున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: