గతకొంతకాలంగా ఏపీ టికెట్ల రేటు పెంపు విషయంపై అటు టాలీవుడ్ కు, ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిన ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ను బాగా తగ్గించడంతో సినీ పరిశ్రమ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట ఒకరిద్దరి హీరోలు మాత్రమే స్పందించారు.. ఆ తరువాత ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా కూడా ఎలాంటి పరిష్కారం జరగలేదు. ఇక ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వ తీరుని విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పేర్ని నాని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి, ఆయన అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ని జగన్ ఆహ్వానించి ఆయనతో చర్చలు జరిపారు. అప్పుడు జగన్ కు తమ సమస్యలు చెప్పామని.. జగన్ కూడా సానుకూలంగా స్పందించారని.. మరోసారి కలుస్తామని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరుతో పాటు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్, హీరోలు కూడా సీఎం తో భేటీకి వెళుతున్నారు. రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అరవింద్ తో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు పయనమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఏపీ సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి ఇంకా ఎవరు వస్తారో తనకు తెలియదని, చూద్దామని ఆయన అన్నారు. నేటితో సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడుతుందని అనుకుంటున్నానని చెప్పారు. మరి ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు ఈ సమావేశానికి వెళుతున్నారు కాబట్టి నేటితో ఈసమస్య పరిష్కారం అవుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: