టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇక నమ్రత కూడా ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూరు కాబట్టే టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతుల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ కామెంట్ చేస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి 2005 లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహబంధానికి నేటితో 17 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ తన సోషల్ మీడియా ద్వారా నమ్రతకు యానివర్శిరీ శుభాకాంక్షలు తెలిపారు. 17 యేళ్లు చాలా ఈజీగా గడిచిపోయాయి.. హ్యాపీ యానివర్శిరీ నమ్రత.. ఇంకా ఎన్నో యేళ్లు ఇలానే ఉండాలి అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక మిగిలిన షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ప్రేమికుల రోజున ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక దీనితో పాటు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా చేసిన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: