సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులైపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో సినిమా రాలేదు. ఇక అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలినా పోర్షన్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. క కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మహేష్ తివిక్రమ్ తో కూడా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అనుకుంటుండగా తాజాగా ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ వేడుకకు మహేష్ బాబు హాజరుకాకపోవడంతో నమ్రత శిరోద్కర్ పాల్గోన్నారు. ఇక ఈసినిమాలో కూడా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈనేపథ్యంలో పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. న్యూ చాప్టర్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధా కృష్ణ నిర్మిస్తున్నారు.
A new chapter unfolds! #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine pic.twitter.com/SrfnrwIUqv
— Mahesh Babu (@urstrulyMahesh) February 3, 2022
ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో అతడు హిట్ అవ్వగా.. ఖలేజా మాత్రం నిరాశపరిచింది. మరి ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి రాబోతున్నారు. ఈసారి ఎలాంటి కథతో వస్తారో వేచి చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: