సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. హీరో మహేశ్ బాబు మోకాలు సర్జరీ, కొవిడ్ బారిన పడిన కారణంగా ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ గత కొంతకాలంగా వాయిదా పడింది.ప్రస్తుతం మహేష్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవడం తో చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించి మార్చి నెలలో కంప్లీట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ”సర్కారు వారి పాట”మూవీ ని ఏప్రిల్ 1వ తేదీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా కరోనా కారణంగా భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ మారడంతో “సర్కారు వారి పాట”న్యూ రిలీజ్ డేట్ మే 12 వ తేదీ గా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: