పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశారు. దానికి తోడు టీజర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమా కోసం అటు పవన్ అభిమానులు.. ఇటు రానా అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికే పెద్ద సినిమాలు లైన్ లో ఉండటం.. ఇంకా కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కూడా మొదలవ్వడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ.. ఫిబ్రవరి 25 కు మార్చారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ డేట్ కూడా మారే అవకాశం ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ తాాజాగా పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ దాదాపు ఫిక్స్ అవ్వడంతో ఈసినిమా కూడా రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసింది. అయితే రెండు రిలీజ్ డేట్లను ఆప్షన్ లో పెట్టుకున్నారు మేకర్స్. పరిస్థితులు అనుకూలిస్తే ‘భీమ్లా నాయక్’ ను ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న తీసుకువస్తామని చిత్రబృందం వెల్లడించింది.
As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all.
We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp
— Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022
కాగా ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: