అల్లరి నరేష్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన పెట్టి కాస్త డిఫెరెంట్ గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాంది లాంటి డిఫరెంట్ స్టోరీతో వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా నేడు ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ను బాలు మున్నంగి కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు.
#Naresh59 – A story to cherish.
Seeking all your Love & blessings 🙏
Stay tuned.A film by @raajmohan73 🎬@anandhiactress@ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @abburiravi @SricharanPakala @RaamDop #BhaskarBandi pic.twitter.com/ZyDlETug7q
— Allari Naresh (@allarinaresh) February 1, 2022
కాగా ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: