మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ భాషల ప్రేక్షకులు “పుష్ప ” మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్”మూవీ ఐదు భాషలలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమిళ నాడు లో పెద్ద సినిమాలు కాక చిన్న , మీడియం సినిమాలు రిలీజ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ థియేటర్స్ కళకళలాడేలా “పుష్ప :ది రైజ్”మూవీని సుమారు 50 థియేటర్స్ లో రీ రిలీజ్ చేయడానికి ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకున్నారు. అది ఈ మూవీ పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: