టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సుధీర్ బాబు దర్శకుడి పాత్రలో.. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించనున్నారు. ఆరు సంవత్సరాల్లో ఆరు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ సినిమాలు అంటే పడని హీరోయిన్ ను సినిమాల్లోకి ఎలా తీసుకొచ్చాడన్నది ఈసినిమా కథ అని అర్థమవుతుంది. ‘ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామని అనుకుంటున్నాను’ అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Just a peek into the story I’ve been waiting to tell you… 😊#AaAmmayiGurinchiMeekuCheppali#AAGMCTeaser
Chusi ela undho cheppandi 😀#IndragantiMohanaKrishna@IamKrithiShetty @MythriOfficial @benchmarkstudi5 @pgvinda @oddphyscehttps://t.co/RU8EdTNca2— Sudheer Babu (@isudheerbabu) January 22, 2022
ఇక ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉంది. ఇక ఈసినిమాకు కూడా తన లక్ కలిసొస్తుందేమో చూడాలి. ఇంకా ఈసినిమాలో ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: