సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్ను విడుదల చేయలేకపోయింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
It’s locked, loaded and ready to release tomorrow!! Super excited!!! ✌️😎#AAGMCTeaser #AaAmmayiGurinchiMeekuCheppali#IndragantiMohanaKrishna @IamKrithiShetty @MythriOfficial @benchmarkstudi5 @pgvinda @oddphysce pic.twitter.com/NBz2k4t0OL
— Sudheer Babu (@isudheerbabu) January 21, 2022
కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: