కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మాత్రం సినీ సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఒక్క రోజులోనే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డామని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఇక ఇప్పుడు మరొక లెజెండరీ గాయని కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ . లతా మంగేష్కర్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం లక్షణాలు కాస్త తక్కువగా ఉన్నా వయసురీత్యా ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా ట్విట్టర్ ద్వారా తెలిపారు. లతా మంగేష్కర్ గారికి ‘స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచాము. దయచేసి మా గోప్యతను గౌరవించండి’ అని పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు, సినీ ప్రముఖులతో పాటు అందరూ కోరుకుంటున్నారు.
“She is doing fine; has been kept in ICU only for precautionary reasons considering her age. Please respect our privacy and keep Didi in your prayers,” singer Lata Mangeshkar’s niece Rachna to ANI
— ANI (@ANI) January 11, 2022
కాగా 1929 సెప్టెంబర్ 28న జన్మించిన లతా మంగేష్కర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఇండియన్ నైటింగెల్గా పేరు సంపాదించిన ఆమె తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకూ 50వేలకు పైగా పాటలను ఆలపించారు. ఇక భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: